: రాజ్ నాథ్ భద్రత పాక్ బాధ్యతే: స్పష్టం చేసిన భారత్

సార్క్ సమావేశాల నిమిత్తం పాకిస్థాన్ లో పర్యటనకు వెళ్లే భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భద్రత బాధ్యతలు ఆ దేశానివేనని ఇండియా స్పష్టం చేసింది. ఆయన్ను పాక్ లో అడ్డుకుంటామని హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించిన నేపథ్యంలో, విదేశాంగ శాఖ స్పందించింది. రాజ్ నాథ్ పర్యటనలో ఎలాంటి మార్పూ ఉండదని, భద్రతపై తమకు ఆందోళనేమీ లేదని పేర్కొంది. కాగా, మరో రెండు రోజుల్లో ఇస్లామాబాద్ బయలుదేరే రాజ్ నాథ్ సింగ్, అక్కడ జరిగే సార్క్ దేశాల సదస్సులో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే.

More Telugu News