: పెళ్లి చేయలేనేమోనన్న భయంతో కన్నకూతురిని నరికి చంపిన రైతు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ రైతు కుమార్తెకు పెళ్లి చేయలేనేమోనన్న భయంతో ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు. నిద్రపోతున్న కూతురును గొడ్డలితో నరికి చంపాడు. హర్యాణా రాష్ట్రంలోని రేవారి జిల్లా బెరంపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన రైతు మహేందర్ సింగ్‌కు పదో తరగతి చదువుతున్న కూతురు సంజన(15) ఉంది. ఆమెకు పెళ్లి వయసు సమీపిస్తుండడంతో మహేందర్‌కు పెళ్లిపై దిగులు పట్టుకుంది. ఆమెను చంపేస్తే సమస్య పరిష్కారమవుతుందని భావిస్తూ అవకాశం కోసం ఎదురుచూశాడు. శనివారం రాత్రి భార్య, కుమారులు బయటకు వెళ్లడంతో తన ప్రణాళికను అమలు చేశాడు. నిద్రిస్తున్న కుమార్తెను గొడ్డలితో నరికి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మహేందర్ కోసం గాలిస్తున్నారు.

More Telugu News