: ‘మెగా- మంచు’ ఫ్యామిలీలు కలిసి పార్టీ చేసుకున్న వేళ!

‘మెగా’ ఫ్యామిలీ, ‘మంచు’ ఫ్యామిలీలు కలిసి ఇటీవల సరదాగా ఒక పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. మెగాపవర్ స్టార్ రాంచరణ్, భార్య ఉపాసన, మంచు లక్ష్మీ, ఆమె భర్త ఆండీ శ్రీనివాస్ ఈ పార్టీలో ఎంజాయ్ చేశారట. థాయ్ లాండ్ లోని ఖోసముయ్ అనే ప్రాంతంలో వీరంతా కలిసి ఎంజాయ్ చేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంచు లక్ష్మి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, ప్రస్తుతం ‘ధ్రువ’ చిత్రంలో రాంచరణ్, ‘లక్ష్మీ బాంబ్’ సినిమాలో మంచు లక్ష్మీ నటిస్తున్నారు.

More Telugu News