: టెస్టులకు గుడ్ బై చెప్పనున్న విండీస్ క్రికెటర్ శామ్యూల్స్

వెస్టిండీస్‌ క్రికెటర్ మార్లోన్‌ శామ్యూల్స్‌ టెస్ట్‌ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. విండీస్ బోర్డు ఇచ్చే రెమ్యూనరేషన్‌ హేతుబద్ధంగా లేదని భావిస్తున్న శామ్యూల్స్‌...టెస్టు క్రికెట్ కి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టెస్టు కెరీర్ లో 65 మ్యాచ్ లు ఆడిన శామ్యూల్స్‌ 3,673 పరుగులు చేశాడు. విండీస్ సాధించిన వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ జట్లలో శామ్యూల్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. టీ20 ఫైనల్ ను గట్టెక్కించింది శామ్యూల్స్ ఆటతీరుకావడం విశేషం. కాగా, రెమ్యూనరేషన్ విషయంలో విండీస్ బోర్డు, ఆటగాళ్ల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

More Telugu News