: ‘కబాలి’ నాకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది: నిర్మాత కలైపులి

‘‘కబాలి’ సినిమా నాకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది. ఈ రోజులను నేనెప్పటికీ మరవలేను’ అని ‘కబాలి’ చిత్ర నిర్మాత కలైపులి థాను అన్నారు. ఆ చిత్రం వసూలు చేసిన కలెక్షన్ల వివరాలను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ.90 కోట్లని, ఇందులో కేవలం అమెరికాలోనే రూ.28 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. ఇక భారత్ లో తొలి మూడురోజుల్లో దాదాపు రూ.100 కోట్లు వసూలు చేశాయని అన్నారు. కాగా, ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే.

More Telugu News