: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్!... ప్రధాని మోదీతో కీలక భేటీ!

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేటి ఉదయం ఉన్నట్టుండి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. నిన్నటిదాకా గవర్నర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన షెడ్యూలే లేదు. అయితే నేటి ఉదయం ఉన్నట్టుండి ఆయన ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. అంతేకాకుండా ఢిల్లీలో అడుగు పెట్టీపెట్టగానే ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి అందిన ఆదేశాలతోనే ఆయన ఢిల్లీకి ఉన్నపళంగా బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. నేరుగా ప్రధానితోనే గవర్నర్ సమావేశం కావడంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏదో కీలక నిర్ణయమే జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.

More Telugu News