: అల్పపీడన ద్రోణి.. కోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు

ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చెదురుమదురు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని పెద్దాపురంలో 10, చోడవరంలో 9, తాడేపల్లిగూడెంలో 7, విజయనగరం, బాపట్లలలో 6, నర్సీపట్నం, పోలవరం, గూడూరు, ఎమ్మిగనూరు, మదనపల్లిలో 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. తెలంగాణలోని కొల్లాపూర్, అశ్వారావుపేటలో 4, చిన్నారావు పేటలో 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

More Telugu News