: అమెరికాలో రూమ్ మేట్ చేతిలో హత్యకు గురైన హైదరాబాద్ టెక్కీ సంకీర్త్

హైదరాబాద్, కాచిగూడకు చెందిన సాఫ్ట్ వేర్ నిపుణుడు సంకీర్త్, అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. నార్త్ హాస్టిన్ లో ఉంటూ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సంకీర్త్ ను, రూమ్ లో అతనితో పాటు ఉండే సాయి సందీప్ గౌడ్ హత్య చేసినట్టు తెలుస్తోంది. వీరు గత వారాంతం ఓ పార్టీకి వెళ్లగా, అక్కడ సంకీర్త్, సందీప్ ల మధ్య గొడవ జరిగిందని, దీని కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సాయి సందీప్ ను అదుపులోకి తీసుకున్న ఫెడరల్ పోలీసులు, కేసును విచారిస్తున్నారు. సంకీర్త్ హత్యతో కాచిగూడలోని అతని కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.

More Telugu News