: తొలి టెస్టుకు ఆండర్సన్ ను ఎంపిక చేయాల్సింది: బ్రాడ్

పాకిస్థాన్ తో జరగనున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ను ఎంపిక చేయాల్సిందని ఆ జట్టు స్పీడ్ స్టర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. మరో రెండు రోజుల్లో తొలి టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో బ్రాడ్ మీడియాతో మాట్లాడుతూ, ఆండర్సన్ ను ఎంపిక చేసి ఉంటే తనకు కొంత ధైర్యంగా ఉండేదని అన్నాడు. గత వారం ఆండర్సన్ ను కలిశానని, అతను ఫిట్ గానే ఉన్నాడని బ్రాడ్ చెప్పాడు. తొలి టెస్టుకు ఎంపిక కాలేదని తెలిస్తే జేమ్స్ ఆండర్సన్ నిరాశకు గురవుతాడని భావించి, అతనికి విషయం చెప్పలేదని అన్నాడు. అయితే గాయపడ్డ జిమ్మీ తొలి టెస్టులో ఆడితే గాయం తిరగబెడుతుందన్న భావంతోనే తొలిటెస్టుకు అతనికి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చి ఉంటారని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టునాటికి ఆండర్సన్ జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నానని బ్రాడ్ తెలిపాడు.

More Telugu News