: మహేష్ బాబు ట్వీట్ ఎలా మిస్సయ్యానబ్బా?: ఆశ్చర్యపోతున్న త్రిష

అప్పుడప్పుడు అనుకోకుండా కొన్నింటిని మనం మిస్సయిపోతుంటాం. చెన్నయ్ అందం త్రిష కూడా అలాగే ఓ ఇంపార్టెంట్ ట్వీట్ ను మిస్సయ్యానంటూ ఇప్పుడు బాధపడుతోంది. 'అతడు', 'సైనికుడు' సినిమాల్లో మహేశ్‌ బాబుతో కలసి నటించిన త్రిష, అప్పట్లో 'మహేష్ బాబు తన ఫేవరేట్ హీరో' అని చెప్పేది. ఆ తర్వాత మహేష్ బాబు సోషల్ మీడియాలో 2010లో ఖాతా తెరిచారు. ఆ సమయంలో ఆయన నటించిన ‘ఖలేజా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఆ సినిమా ప్రమోషన్ కోసం అభిమానులతో మహేష్ బాబు చాట్ చేశాడు. ఆ సమయంలో ఓ అభిమాని ట్విట్టర్లో 'మీకు ఇష్టమైన కో-స్టార్‌ ఎవరు?' అంటూ అడిగాడు. దీనికి మహేశ్‌ సమాధానమిస్తూ, 'త్రిష, అనుష్క తనకు ఇష్టమైన కో-స్టార్స' అని చెప్పాడు. అయితే, త్రిష అప్పుడు దీనిని త్రిష చూడలేదు. ఆ విషయాన్ని కూడా ఎవరూ ఆమెకు చెప్పలేదట. ఆరేళ్ల తరువాత తాజాగా ఈ ట్వీట్ చూసిన త్రిష ‘నేను దీన్ని ఎలా మిస్‌ అయ్యానబ్బా?’ అంటూ ఆశ్చర్యంతో ట్వీట్‌ చేసింది.

More Telugu News