: నరమేధానికి ముందు... పాస్తా, చేపల కూర వండించుకుని తిన్న ఢాకా ముష్కరులు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరిలో 20 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు నిజంగా నరరూప రాక్షసులేనని నిరూపితమైంది. సదరు బేకరిలో అసిస్టెంట్ కుక్ గా పనిచేస్తున్న ఓ హిందూ యువకుడు తాను కూడా ముస్లిం వ్యక్తినేనని చెప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతడు అక్కడ జరిగిన దారుణ మారణ కాండను మీడియాకు వెల్లడించాడు. అతడు చెప్పిన కథనం మేరకు... ఆర్టిసాన్ బేకరిలోకి ఏడుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. వచ్చీ రాగానే అక్కడున్న వారందరినీ బందీలుగా పట్టుకున్నారు. ఆ తర్వాత బాత్ రూంలో దాక్కున్న వారిని బయటకు పిలిచిన ఉగ్రవాదులు వారంతా ముస్లింలే అని నిర్ధారించుకున్నారు. వెంటనే తిరిగి వారిని బాత్ రూంలోకే నెట్టేసి గడియ పెట్టారు. ఆనక బేకరిలో పనిచేస్తున్న చెఫ్ లను రప్పించుకుని తమకిష్టమైన పాస్తా, చేపల కూర వండించుకుని తిన్నారు. తదనంతరం ముస్లింలు కాని విదేశీయులుగా నిర్ధారించుకున్న 20 మందిని అత్యంత దారుణంగా చంపేశారు. ఆ తర్వాత చనిపోయిన విదేశీయుల శవాల మధ్యే కుర్చీలు వేసుకుని కూర్చుని వారు కులాసాగా మాట్లాడుకున్నారట.

More Telugu News