: జెద్దా సూసైడ్ బాంబర్ పాకిస్థానీ!... సంచలన ప్రకటన చేసిన సౌదీ అరేబియా!

పాకిస్థాన్ భూభాగం మీద కరుడుగట్టిన ఉగ్రవాదులుగా మారుతూ భారత్ పై విరుచుకుపడుతున్న ఆ దేశ ముష్కరులు తాజాగా ఇస్లామిక్ దేశాలపైనా గురి పెట్టారు. ఇందుకు నిదర్శనమే నిన్న ఉదయం సౌదీ అరేబియా నగరం జెద్దాలోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా జరిగిన దాడి అని చెప్పొచ్చు. ఇద్దరు భద్రతాధికారులను గాయాల పాలు చేసిన ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి పాకిస్థాన్ కు చెందిన యువకుడు అని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (హోం శాఖ) ప్రకటించింది. పాకిస్థాన్ కు చెందిన 35 ఏళ్ల అబ్దుల్లా వకార్ ఖాన్ ఈ దాడికి పాల్పడ్డాడని ఆ శాఖ వెల్లడించింది. డ్రైవర్ గా పనిచేస్తున్న వకార్... 12 ఏళ్ల క్రితమే తల్లిదండ్రులు, భార్యతో కలిసి జెద్దాకు వచ్చాడని ఆ శాఖ వెల్లడించింది.

More Telugu News