: హీరో రానా ‘మెగా’ సెల్ఫీ... అదుర్స్!

సింగపూర్ లో జరుగుతున్నసౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుకలకు దక్షిణాది సినీ నటులు తరలి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, అర్జున్, హీరోయిన్లు సమంత, రాధిక, కుష్బూ, మంచు లక్ష్మీ ప్రసన్న తదితరులు హాజరయ్యారు. అలాగే, ఈ వేడుకకు దగ్గుబాటి రానా కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సహా పలువురి నటీనటులతో కలిసి దిగిన సెల్ఫీని రాణా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఈ సెల్ఫీ ఎన్నోమాటలు చెబుతుంది’ అనే క్యాప్షన్ తో రానా చేసిన ట్వీట్ ను పలువురు అభిమానులు పంచుకున్నారు.

More Telugu News