: జోరువానను ఎంజాయ్ చేసిన ధోనీ

జింబాబ్వే టూర్ ను విజయవంతంగా ముగించిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ థోనీ విరామాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. జోరువానలో సొంత నగరం రాంచీలో బైకుపై ధోనీ చక్కర్లు కొట్టాడు. నిర్మానుష్యంగా మారిన రోడ్లపై ధోనీ దూసుకుపోయాడు. ఈ సందర్భంగా ఓ కూడలిలో తలకు హెల్మెట్ తో వర్షాన్ని ఆస్వాదిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పోస్టు చేశాడు. వర్షాలు కురవాలని, అవి రైతులకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. ఫోటోలో హెల్మెట్ తో ధోనీ అభిమానులను అలరిస్తున్నాడు.

More Telugu News