: గవర్నర్ ను కలిసిన కేసీఆర్... అరగంట పాటు మంతనాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం రాజ్ భవన్ కు వచ్చి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు వీరిద్దరి మధ్యా భేటీ జరుగగా, న్యాయాధికారులు, న్యాయవాదుల వివాదంపై గవర్నర్ కు వివరించినట్టు తెలిసింది. హైకోర్టు విభజన ఆలస్యం అవుతుండటంతో, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ఇక్కడి న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియ ఉదంతాలను ఆయన వివరించినట్టు సమాచారం. పరిస్థితులు సద్దుమణగాలంటే, తక్షణం హైకోర్టు విభజన జరగాల్సిందేనని, అందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది.

More Telugu News