: చైనాలో స్వదేశీ తొలి వాణిజ్య విమానం ప్రారంభం

చైనా మొదటి స్వదేశీ ప్రాంతీయ వాణిజ్య విమాన సర్వీసు చెంగ్డు ఎయిర్ లైన్స్ నేటి నుంచి ప్రారంభించింది. కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా లిమిటెడ్ (సీవోఎంఏసీ) ఈ విమానాన్ని రూపొందించింది. ఏఆర్ జె 21-700 నంబర్ విమానం చెంగ్డు నుంచి షాంఘై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకు తొలి ప్రయాణం ప్రారంభించింది. ఈ విమానంలో 78 నుంచి 90 మంది ప్రయాణికులు ప్రయాణించే సదుపాయం ఉంది. ఈ సందర్భంగా విమానాశ్రయ సిబ్బంది పాండా వేషాలు ధరించి ఈ విమానానికి స్వాగతం పలికారు.

More Telugu News