: అసలు నాతో సమస్యేంటో గంగూలీని అడగండి: రవిశాస్త్రి

టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని భావించి, అనిల్ కుంబ్లేతో పోటీపడి ఓడిపోయిన మాజీ టీం డైరెక్టర్ రవి శాస్త్రి, కోచ్ ని ఎంపిక చేసిన విధానమే తనకు నిరుత్సాహాన్ని కలిగించిందని అన్నాడు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, తాను గత 18 నెలలుగా ఓ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో కృషి చేస్తూ వచ్చానని, తదుపరి మూడేళ్లలో ఎంతో సాధించాలని ప్రణాళికలు వేశానని చెప్పారు. ఓ టాలెంటెడ్ టీమ్ ను సృష్టించిన వేళ, తనను దూరం పెట్టారని చెప్పారు. అనిల్ కుంబ్లేను ఎంపిక చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు దానికి సమాధానం చెప్పాల్సింది తాను కాదని అన్నాడు. తనతో ఉన్న సమస్యేంటో సౌరవ్ గంగూలీనే అడిగి తెలుసుకోవాలని చెప్పాడు. తన బాధ్యత ఇంటర్వ్యూకు హాజరవడమేనని, ఆపై వెనకాల ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. కాగా, తన ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ అసలు లేనే లేడని రవిశాస్త్రి ఇప్పటికే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గంగూలీయే తనను అడ్డుకున్నాడని కూడా రవిశాస్త్రి ఆరోపించాడు. ఇంటర్వ్యూలో ఏం అడిగారని ప్రశ్నిస్తే, తానేమీ సీఈఓ పోస్టుకు దరఖాస్తు చేయలేదని, సచిన్, సంజయ్ జగ్దాలే, వీవీఎస్ లక్ష్మణ్ లతో భారత క్రికెట్ భవిష్యత్ గురించి ఎంతో చర్చించానని, తాను టీమ్ డైరెక్టరుగా ఉన్న సమయంలో కొన్ని విషయాలను గుర్తు చేశానని తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మంచి ఆటతీరు చూపిందని వెల్లడించినట్టు పేర్కొన్నాడు. విజయం కోసం ఆటగాళ్లు తపిస్తున్నారని వెల్లడించానని. టెస్టు క్రికెట్ లో నెంబర్ వన్ హోదాలో లేకపోవడానికి కారణం ఆరు నెలలుగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడమేనని గుర్తు చేసినట్టు వివరించాడు.

More Telugu News