: కేసీఆర్ ను ఆపేదెలా? సోనియా వద్ద వీహెచ్, పాల్వాయి మంతనాలు!

కాంగ్రెస్ నేతలను ఆకర్షిస్తూ, టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్న సీఎం కేసీఆర్ ను నిలువరించడమెలా? అన్న విషయంలో అధినేత్రి సోనియా గాంధీతో, కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పాల్వాయి గోవర్థన్ రెడ్డిలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఇద్దరు నేతలూ, సోనియాను కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తాజా రాజకీయ పరిణామాలపై ఆమెకు వివరించారు. ఫిరాయింపులను ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ మారిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్, అందుకు సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలు నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. కాంగ్రెస్ నేతల ఢిల్లీ టూర్లతో ఇక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది.

More Telugu News