: ఆ పాటను నలభై ఐదు నిమిషాల్లో రాశాను: చంద్రబోస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘కొమురం పులి’ చిత్రంలోని ‘మారాలంటే లోకం...’ పాటను చాలా తక్కువ సమయంలో... నలభై ఐదు నిమిషాల్లోనే రాశానని పాటల రచయిత చంద్రబోస్ అన్నారు. ‘చెన్నై లోని ఏఆర్ రెహ్మాన్ థియేటర్ లో... రెహ్మాన్ గారు బాణీ చెప్పారు. ఆయన చెబుతున్న సమయంలోనే మాటలు అల్లుకుంటూ ఆ పాట రాశాను. ఈ పాట నాకు చాలా ఇష్టం’ అని చంద్రబోస్ చెప్పారు.