: చెక్ బౌన్స్ కేసు.. పోలీసుల అదుపులో బాలీవుడ్ నిర్మాత

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలాను అరెస్టు చేయాలంటూ చెన్నైలోని సైదాపేట్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో, ఫిరోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. హిందీ ‘పవర్’ సినిమా కోసం 2011లో నిర్మల్ కుమార్ మహేశ్వరి అనే ఫైనాన్షియర్ వద్ద రెండు కోట్ల రూపాయలు నడియాడ్ వాలా తీసుకున్నాడు. అయితే, ఆ చిత్రం విడుదల కాలేదు. ‘వెల్ కమ్ బ్యాక్’ చిత్రం విడుదల తేదీలోపు అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ.5.4 కోట్లు ఇస్తానని సదరు ఫైనాన్షియర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.2.5 కోట్ల చెక్కును సదరు ఫైనాన్షియర్ కు అందించాడు. ఆ చెక్కు బౌన్స్ అవడంతో నిర్మల్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు.

More Telugu News