: విషాదంలో దావూద్ ఇబ్రహీం!... కేన్సర్ సోకి తమ్ముడి అకాల మరణం!

బెదిరింపులకు గురి చేసి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్న అండర్ వరల్డ్ డాన్, భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకూ విషాదం తప్పలేదు. కేన్సర్ సోకిన అతడి చిన్న తమ్ముడు హుమాయున్ కస్కర్ (40) చనిపోయాడు. 1993లో ముంబైలో మారణ హోమం సృష్టించిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా దేశం విడిచి పరారైన దావూద్... పాకిస్థాన్ వాణిజ్య రాజధాని కరాచీలో దాదాపుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి అతడు అక్కడే పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భద్రత మధ్య నిశ్చింతగా కాలం వెళ్లదీస్తున్నాడు. ముంబై పేలుళ్లతో సంబంధం లేకున్నా హుమాయున్ కస్కర్ కూడా బంగ్లాదేశ్ మీదుగా కరాచీకి చేరి సోదరుడి దగ్గరే ఉంటున్నాడు. అతడిపై ముంబైలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో గత కొంతకాలం క్రితం కేన్సర్ సోకిన కస్కర్ సుదీర్ఘ కాలం పాటు చికిత్స తీసుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో అతడు ఇటీవలే చనిపోయాడు. ఈ మేరకు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఆజ్ తక్’ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది.

More Telugu News