: ఏఆర్ రెహమాన్ స్వరాలకు కోహ్లీ గళం

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గాయకుడి అవతారమెత్తాడు. తాను పాట పాడుతుండగా తీసిన ఒక ఫొటోను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రీమియర్ పుటల్స్ టోర్నీకి కోహ్లీ ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం రూపొందిస్తున్న అధికారిక గీతాన్ని కోహ్లీ పాడాడు. ఈ గీతానికి సంగీత దిగ్గజం ఏఆర్ రెహ్మాన్ స్వరాలను అందించాడు. ఈ పాట రికార్డింగ్ చెన్నయ్ లోని రెహ్మాన్ స్టూడియోలో జరిగిందని ఆ ట్వీట్ లో కోహ్లీ పేర్కొన్నాడు.

More Telugu News