: రియో నుంచి 3 వేల గంటల లైవ్... 8 చానల్స్ పూర్తిగా అంకితం: స్టార్ ఇండియా

మరో 49 రోజుల్లో ప్రారంభం కానున్న విశ్వ క్రీడా సంబరాలు 'రియో ఒలింపిక్స్'ను భారత అభిమానులకు అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని స్టార్ ఇండియా ప్రకటించింది. ఆగస్టు 5 నుంచి పోటీలు ప్రారంభం కానుండగా, మొత్తం 3 వేల గంటలకు పైగా లైవ్ ప్రసారాలు ఉంటాయని, వీటిని 8 స్టార్ చానళ్ల ద్వారా వివిధ భాషల్లో అందిస్తామని స్టార్ స్పోర్ట్స్ సీఈఓ నితిన్ కుక్రేజా వెల్లడించారు. 24 గంటల పాటూ ఈ ప్రసారాలు ఉంటాయని, తొలిసారిగా ఆరంభ వేడుకలను రెండు భాషల్లో ప్రసారం చేస్తామని తెలిపారు. తమ యాప్ హాట్ స్టార్ లో ఉచితంగా ఒలింపిక్స్ పోటీలను చూడవచ్చని అన్నారు. లైవ్ కామెంట్రీ, ఇండియాలోని క్రీడా పండితులతో కూడిన విశ్లేషణలు ఉంటాయని ఆయన వివరించారు.

More Telugu News