: రియోలో భారత పతాకధారి బింద్రా... మెగా టోర్నీ తర్వాత షూటింగ్ కు వీడ్కోలు

త్వరలో ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ భారత బృందానికి షూటింగ్ సంచలనం అభినవ్ బింద్రా ముందు నడవనున్నాడు. భారత జాతీయ పతాకాన్ని చేతబట్టుకుని రియోలో భారత బృందానికి ముందు నడవనున్న అతడు భారత పతాకధారిగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఇంతటి సంతోషకరమైన వార్త వెలువడిన నాడు అతడు మరో సంచలన ప్రకటన చేశాడు. రియో ఒలింపిక్స్ సంరంభం ముగిసిన తర్వాత తాను అస్త్ర సన్యాసం చేయనున్నట్లు అతడు ప్రకటించాడు. దాదాపు 20 ఏళ్ల పాటు షూటింగ్ లో సత్తా చాటిన బింద్రా... 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకాన్ని సాధించిపెట్టాడు. తాజా రియో ఒలింపిక్స్ ముగిసిన మరుక్షణమే ఆగస్టు 8న తాను షూటింగ్ క్రీడ నుంచి తప్పుకుంటానని అతడు నిన్న ప్రకటించాడు.

More Telugu News