: మోదీని కారులో కూర్చోబెట్టుకుని రెస్టారెంట్ కు తీసుకెళ్లిన మెక్సికో అధ్యక్షుడు

భారత్ కు ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం స్వయంగా రంగంలోకి దిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. అమెరికాలో పర్యటన ముగించుకుని నిన్న మెక్సికో వెళ్లిన మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మోదీకి మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీతో వద్ద అరుదైన గౌరవం దక్కింది. మోదీని తన కారెక్కించుకుని, సదరు కారును స్వయంగా డ్రైవ్ చేసిన ఎన్రిక్... మెక్సికో సిటీ వీధుల్లో తిప్పారు. ఆ తర్వాత అక్కడి ఓ వెజిటేరియన్ రెస్టారెంట్ ముందు కారు ఆపిన ఎన్రిక్... మోదీని అందులోకి తోడ్కుని వెళ్లారు. మోదీకి ఇష్టమైన ఆహార పదార్థాలను ఎన్రిక్ ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వారిద్దరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. మోదీకి లభించిన ఈ అరుదైన గౌరవాన్ని భాతర విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

More Telugu News