: పెళ్లి కంటే నాకు ఆస్కారే ముఖ్యం: అలియా భట్

బాలీవుడ్ నటి అలియా భట్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. సిద్ధార్థ్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న అలియాను 'ఉడ్తా పంజాబ్' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా 'పెళ్లి ఎప్పుడు?' అంటూ మీడియా ప్రశ్నించింది. దీనికి అలియా సమాధానమిస్తూ, 'కొంత మంది యువతులు జీవితంలో పెళ్లే ముఖ్యమనుకుంటారు, కానీ నాకు మాత్రం ఆస్కార్ ముఖ్యం' అని చెప్పింది. ఉడ్తా పంజాబ్ సినిమాలోని తను పోషించిన పింకీ పాత్ర చాలా కష్టమైనదని చెప్పింది. అయితే పాత్రలో జీవించేందుకు దర్శకుడు అభిషేక్ చౌబే సాయం తీసుకున్నానని తెలిపింది. తనకు తెలిసినంతవరకు షాహిద్ కపూర్ మద్యం ముట్టలేదని, అయితే ఈ సినిమాలో తాగుబోతులా అద్భుతంగా కనిపించాడని కితాబునిచ్చింది. షాహిద్ ను ఆ అవతారంలో చూసి తానే షాకయ్యానని చెప్పింది. కాగా ఈ సినిమాలో కరీనా కపూర్ కూడా నటించిన సంగతి తెలిసిందే.

More Telugu News