: భారత్, పాక్ మ్యాచ్ కి ముందు విరాట్ కోహ్లీ కిడ్నాప్ అయితే... 'డిష్యూమ్' చిత్రంలోని పాయింట్ ఇదే!

చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ మధ్య మరికాసేపట్లో క్రికెట్ పోటీ ప్రారంభం కానుంది. స్టేడియమంతా ప్రేక్షకులతో నిండిపోయింది. అభిమానులు కేకలు, అరుపులతో దద్దరిల్లుతోంది. ఆ సమయంలో జట్టులో ఆడుతున్న ఢిల్లీకి చెందిన కీలక ఆటగాడు కిడ్నాప్ అయితే... ఇదే కథాంశంతో దర్శకుడు రోహిత్ ధావన్ రూపొందిస్తున్న చిత్రం 'డిష్యూమ్'. ఇందులో విరాట్ కోహ్లీ పాత్రలో సఖీబ్ సలీమ్ నటిస్తున్నాడు. చిత్రంలో అతని పాత్ర పేరు విరాజ్. మ్యాచ్ కి నిమిషాల ముందు కిడ్నాపైన పాత్రలో సలీమ్, ఇతర ముఖ్యపాత్రల్లో జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, రాహుల్ ఖన్నాలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రయిలర్ విడుదలైంది.

More Telugu News