: నేను ఇంతవరకూ ఎవరికీ సారీ చెప్పలేదు... నీకు చెబుతున్నాను శిల్పా: దర్శకుడు వర్మ

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మొట్టమొదటిసారిగా ‘సారీ’ చెప్పాడు. తన తాజా చిత్రం ‘వీరప్పన్’పై నెగిటివ్ రివ్యూ రాసిన రాయిటర్స్ వార్తా సంస్థ జర్నలిస్ట్ శిల్పా జామ్ ఖండికర్ పై వర్మ తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు సారీ చెబుతూ వర్మ ఒక ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు తానెవరికీ క్షమాపణలు చెప్పలేదని, తాను చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కోరాడు. కాగా, నెగెటివ్ రివ్యూ రాసిన ఆమెపై... ‘నీ ముఖమంత అందంగా ‘వీరప్పన్’ ఉంది' అంటూ వర్మ కామెంట్ చేశాడు.

More Telugu News