: ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. 20 మందికి పైగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఈరోజు రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యావరణం, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ కల్లాం, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రావత్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిసోడియా, జలవనరుల శాఖ కార్యదర్శిగా శశిభూషణ్ లను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News