: చేప మందు పంపిణీకి సిద్ధమవుతున్న బత్తిని సోదరులు

ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందును పంపిణీ చేసేందుకు బత్తిని సోదరులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను వారు కలిశారు. వచ్చే నెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ ఏర్పాట్ల విషయమై వీరు సీఎస్ తో చర్చించారు. కాగా, ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రారంభంలో బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లపాటు ఈ మందు క్రమం తప్పకుండా తీసుకుంటే ఉబ్బసం వ్యాధి నయమవుతుందని చాలా మంది నమ్ముతారు.

More Telugu News