: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఆరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులవే
ఈరోజు ప్రకటించిన తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో ఏపీ విద్యార్థులు ఆరుగురు టాప్ టెన్ ర్యాంకులు సాధించారు. ఐదు నుంచి పది ర్యాంకులు సాధించిన రాహల్, వెంకట సాయి గణేశ్, తన్మయి, గౌతమ్, జయకృష్ణ సాయి వినయ్, వంశీ కృష్ణారెడ్డి అందరూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులే. మొదటి నాలుగు ర్యాంకులు తెలంగాణ విద్యార్థులు సాయితేజ (తొలి ర్యాంక్), చేతన్ సాయి (రెండో ర్యాంక్), నిఖిల్ సామ్రాట్ (మూడో ర్యాంక్), విఘ్నేష్ రెడ్ డి(నాలుగో ర్యాంక్) సాధించారు. కాగా, కొన్ని రోజుల క్రితం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు టాప్ ర్యాంకులు అధికంగా కైవసం చేసుకోవడం గమనార్హం.