: ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్!... షూటింగ్ కారణంగా తాతకు ముందస్తు నివాళి

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నేటి ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో ప్రత్యక్షమయ్యాడు. ప్రస్తుతం సంచలన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘జనతా గ్యారేజ్’లో నటిస్తున్న జూనియర్... ఆ చిత్రం షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇటీవల ఓ షెడ్యూల్ ముగించుకున్న అతడు నగరానికి చేరుకున్నాడు. తదుపరి షెడ్యూల్ రేపు చెన్నైలో ప్రారంభం కానుంది. దీనికోసం అతడు నేటి రాత్రే చెన్నై వెళుతున్నాడు. తన తాత, దివంగత సీఎం ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఈ నెల 28న ఘనంగా జరగనున్నాయి. ఆ రోజు తాను నగరంలో అందుబాటులో ఉండనని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు ముందస్తుగా నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చాడు. తాతకు ఘనంగా నివాళి అర్పించిన జూనియర్ ఆ తర్వాత ఇంటికెళ్లిపోయాడు.

More Telugu News