: ఫిరాయింపులు నీతిబాహ్యం!... దమ్ముంటే రాజీనామా చెయ్యండి: ‘జంపింగ్’లకు సాయిరెడ్డి సవాల్

పార్లమెంటులో పెద్దల సభ రాజ్యసభలో కాలు మోపేందుకు దాదాపుగా అవకాశం లభించడంతో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. నేటి ఉదయం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రాజ్యసభ అభ్యర్థిగా సాయిరెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడే మీడియాతో మాట్లాడిన సందర్భంగా సాయిరెడ్డి పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ఆయన నీతిబాహ్య చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా వైసీపీ టికెట్లపై విజయం సాధించి ఇటీవలే టీడీపీలో చేరిపోయిన ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. దమ్ముంటే తమ పార్టీ టికెట్ పై లభించిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి అసెంబ్లీకి ఎన్నికవ్వాలని ఆయన సూచించారు.

More Telugu News