: తుదిశ్వాస విడిచిన ప్రపంచ కురువృద్ధ మహిళ

ప్రపంచ కురువృద్ధ మహిళ సుసనాహ్ ముసాత్ జోన్స్(116) ఇక‌లేరు. అనారోగ్యంతో నిన్న రాత్రి ఆమె తుది శ్వాస విడిచిన‌ట్లు వైద్యులు తెలిపారు. అన్యారోగ్యంతో బాధ‌ప‌డుతూ ప‌దిరోజులుగా ఆమె చికిత్స పొందుతున్న‌ట్లు చెప్పారు. గ‌త సంవ‌త్స‌రం 117ఏళ్ల మిసావో ఒకావా చనిపోవ‌డంతో సుసనాహ్ ముసాత్ జోన్స్(116) ప్ర‌ప‌ంచ కురువృద్ధ మహిళగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. సుసనాహ్ ముసాత్ జోన్స్ పేరిట ఉన్న ఈ రికార్డును ఇక‌పై ఇటలీ మహిళ ఎమ్మా మారనో-మార్తినుజి(116)కి ద‌క్కించుకోనున్నారు. సుసనాహ్ ముసాత్ జోన్స్ సౌతర్న్‌ అమెరికాలోని అలబామాలో 1899లో జన్మించారు.

More Telugu News