: మంత్రి తలసానిని కలిసిన హాస్యనటుడు వేణుమాధవ్.. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు
ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తుండడం పట్ల సదరు నటుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తనపై కొందరు నెటిజన్లు చేస్తోన్న అసత్య ప్రచారం పట్ల ఇటీవలే హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వేణు మాధవ్.. నేడు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి మరోసారి ఫిర్యాదు చేశాడు. తనకు అనేక వ్యాధులున్నాయంటూ, తాను చనిపోయినట్లు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. నిర్మాతల మండలి సభ్యులు సురేష్ బాబు, దిల్ రాజుతో కలిసి వేణుమాధవ్ మంత్రి తలసానికి ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.