: సైకిల్ పై నుంచి కింద పడ్డ పవన్ కల్యాణ్ కొడుకు... ఆసుపత్రిలో సత్వర చికిత్స అందలేదని రేణూ దేశాయ్ ఆవేదన

టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ లకు ముద్దుల కొడుకు అకీరా నందన్ సైకిల్ పై నుంచి కింద పడ్డాడు. దీంతో ఆ బాలుడికి గాయమైంది. వెనువెంటనే మేల్కొన్న రేణూ దేశాయ్ అతడిని తీసుకుని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి పరుగులు పెట్టింది. అయితే ఎంతటి కార్పొరేట్ ఆసుపత్రి అయినా... అకీరాకు తక్షణ చికిత్స అందించడంలో అది విఫలమైంది. దీంతో గాయం కారణంగా నొప్పితో అకీరా విలవిల్లాడాట. ఈ విషయాన్ని స్వయంగా రేణూ దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలపడమే కాక వైద్య చికిత్సలో జాప్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ట్వీట్ లో రేణూ దేశాయ్ ఏమన్నారంటే... ‘‘అకీరా సైకిల్ ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతడిని పేరున్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాను. గాయపడిన చిన్న పిల్లాడికి వైద్యం చేయకుండా వైద్యులు ఆలస్యం చేశారు. బాధతో ఎదురుచూడాల్సి వచ్చింది. చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు వెళ్లడం కంటే నేరుగా చనిపోవడమే మేలు. డాక్టర్ల నుంచి నర్సుల వరకు మొత్తం వ్యవస్థ నిర్లక్ష్యం మానవత్వాన్ని చంపేస్తోంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ లకు అకీరాతో పాటు ఆద్య అనే పాప కూడా ఉంది. పవన్ కల్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రేణూ దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి మహారాష్ట్రలోని పూణేలో ఉంటున్న విషయం తెలిసిందే.

More Telugu News