: బుర్రిపాలెంలో కోలాహలం...మహేష్ ను చూసేందుకు తరలిన అభిమానులు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బుర్రిపాలెం సందర్శించనుండడంతో ఆ గ్రామంలో కోలాహలం నెలకొంది. ఎక్కడెక్కడో విద్య, ఉద్యోగాలు చేసుకుంటున్నవారంతా బుర్రిపాలెం చేరుకున్నారు. మహేష్ ప్రణాళికకు చేయూతనివ్వాలని వారంతా తీర్మానించుకున్నారు. మహేష్ బాబు పేరిట వున్న టీషర్టులను ధరించిణ యువత ఆయనకు అభిమానుల నుంచి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామని, రక్షణగా నిలుస్తామని పేర్కొంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహేష్ బాబు అభిమానులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున బుర్రిపాలెం చేరుకున్నారు. మహేష్ రాకకు అభినందనలు తెలుపుతూ భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. మహేష్ బాబు నివాసం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో బుర్రిపాలెం చేరుకోనున్న మహేష్ బాబు అక్కడ పలు కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నాడు. మహేష్ బాబు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడం పట్ల ఆక్కడి యువకుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఊరు విడిచి వెళ్లినవారు తిరిగి స్వస్థలాలకు తిరిగి రావడం లేదని, సొంత తల్లిదండ్రులను కూడా చూసేందుకు వెనక్కిరాని తరుణంలో, ఎంతో ఎత్తుకు ఎదిగి, సొంత ఊరును మర్చిపోకుండా మహేష్ బాబు రావడం తమలో స్పూర్తి నింపుతోందని వారు తెలిపారు.

More Telugu News