: ముంబయి ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ మ‌ధ్య రేపు విశాఖ‌లో పోరు.. మ్యాచ్ సంద‌ర్భంగా ట్రాఫిక్ ఆంక్ష‌లు, భారీగా భద్రత ఏర్పాట్లు

ఐపీఎల్-9లో భాగంగా ముంబయి ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ మ‌ధ్య విశాఖ‌లో రేపు సాయంత్రం 4గంట‌ల నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్‌కు స‌ర్వం సిద్ధం చేశారు. విశాఖ‌లోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. మ్యాచ్ దృష్ట్యా పోలీసులు అక్క‌డి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. స్టేడియం వద్ద 1000 మంది పోలీసులతో గ‌ట్టి భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలతో అక్క‌డి ఎండాడ జంక్షన్ వరకే వాహనాల రాకపోకలను అనుమ‌తించ‌నున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్క‌డ జ‌రిగే అన్ని మ్యాచులకు ఈ ఆంక్ష‌లు వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచి స్టేడియంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.

More Telugu News