: తెలంగాణలో ఖాళీ అయిన వైసీపీ.. గులాబీ కండువా కప్పుకున్న పొంగులేటి
ఆంధ్రప్రదేశ్లో టీడీపీలోకి చేరుతోన్న తమ నేతలతో షాక్లపై షాక్లు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్కి ఇటు తెలంగాణ నుంచి కూడా మరో షాక్ తగిలింది. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, తెలంగాణలోని వైసీపీ ఆరు జిల్లాల అధ్యక్షులు కూడా గులాబీ గూటిలో చేరిపోయారు. శాసనసభలో అధికార టీఆర్ఎస్తో తెలంగాణ వైసీపీ విలీనం కానుంది.