: లాలూ, బాబా రాందేవ్ చెట్టాపట్టాల్... 'పంతంజలి' బ్రాండ్ అంబాసిడర్ గా లాలూ?

పతంజలి యోగా బ్రాండ్ ఉత్పత్తులకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం ఉందని బాబారాందేవ్ తెలిపారు. లక్నోలో లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పతంజలి ఉత్పత్తులకు లాలూను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పతంజలి గోల్డ్ ఫేస్ క్రీమ్ ను లాలూ ముఖానికి ఆయన పూశారు. ఇది రాసుకుంటే ముఖం బంగారు ఛాయలో మెరిసిపోతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పతంజలి సంస్థ తయారు చేసిన కొన్ని వస్తువులను లాలూకు రాందేవ్ అందజేశారు. జూన్ 21న పతంజలి యోగా కేంద్రం నిర్వహించనున్న యోగాదినోత్సవానికి హాజరుకావాలని ఆయన ఆహ్వానించారు. అనంతరం లాలూ మాట్లాడుతూ, పతంజలి ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని అన్నారు. పతంజలి ఉత్పత్తులను చూసి ప్రముఖ సంస్థలు అసూయ చెందుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఉత్పత్తుల ద్వారా బాబారాందేవ్ దేశానికి సేవ చేస్తున్నారని ఆయన తెలిపారు.

More Telugu News