: త్వరలో బీసీలకు కొత్త పార్టీ: ఆర్.కృష్ణయ్య

త్వరలో బీసీలకు కొత్త పార్టీ ఒకటి రానుంది. ఆంధ్ర, తెలంగాణలో 'బీసీ పార్టీ'ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలన్నీ అగ్ర కులాల చేతుల్లోనే ఉన్నాయని, ఇప్పటివరకు బీసీలకు సొంత పార్టీ లేదని అన్నారు. బీసీ పార్టీతో కలిసి వచ్చే అందరినీ కలుపుకుని ముందుకువెళ్తామని ఈ సందర్భంగా కృష్ణయ్య పేర్కొన్నారు.

More Telugu News