: ఫిలింనగర్ ఆలయంలో దర్శకుడు దాసరి ప్రత్యేకపూజలు

దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ లోని దైవసన్నిధానంకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, దాసరికి ఆశీస్సులందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దాసరి అభిమానులు పాల్గొన్నారు. కాగా, దాసరి నారాయణరావు తన కెరీర్ లో ఇప్పటివరకు 150 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.

More Telugu News