: టీ మంత్రి హరీష్ రావు నుంచి ఏపీ మంత్రి దేవినేనికి ఫోన్ కాల్

ఏపీ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫోన్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రాజెక్టుల వివాదాన్ని పరిష్కరించుకుందామని హరీష్ రావు పేర్కొన్నట్లు సమాచారం. కాగా, విభజన చట్టానికి కట్టుబడే ప్రాజెక్టులు నిర్మించుకుందామని, కర్నాటక, మహారాష్ట్రపై పోరాటం చేద్దామని హరీష్ రావుతో ఉమ అన్నారని సమాచారం. కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి సమస్యలను పరిష్కరించుకుందామని దేవినేని ఉమ చెప్పినట్లుగా సమాచారం.

More Telugu News