: 'అ..ఆ' ఆడియో వేడుక ప్రారంభం... ముఖ్య అతిధిగా హాజరైన పవన్ కల్యాణ్... అభిమానుల కేరింతలు

నితిన్ హీరోగా, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న 'అ...ఆ' సినిమా ఆడియో వేడుక హైదరాబాదులోని శిల్పకళావేదికలో ఘనంగా జరుగుతోంది. సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు కూడా ముఖ్య అతిథిగా హాజరుకాని పవన్ కల్యాణ్ ఈ ఆడియో వేడుకకు హాజరుకావడం విశేషం. తనను ఎంతగానో అభిమానించే నితిన్, స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఈ చిత్రంలో భాగం కావడంతో పవన్ కల్యాణ్ ఈ ఆడియో వేడుకకు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ ఆడియో వేడుకకు రావడం, సాక్షాత్తూ నితిన్ అతని అభిమాని కావడంతో వారిద్దరి అభిమానులు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు.

More Telugu News