: మూడు పెగ్గుల మద్యం, నిల్వ వున్న మాంసాహారంతో కేన్సర్ ముప్పు: తేల్చి చెప్పిన పరిశోధకులు
కేన్సర్ ముప్పును పేంచే అంశాల్లో పరిశోధకులు మరో విషయాన్ని కనుగొన్నారు. ప్రతీరోజూ మూడు పెగ్గుల మద్యం, నాన్వెజ్ను స్టోర్ చేసి తినే వారిలో జీర్ణాశయ కేన్సర్ ముప్పు పెరుగుతుందని వరల్డ్ కేన్సర్ రీసెర్చ్ ఫెడరేషన్ పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనాలను విశ్లేషిస్తూ తాము చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్లు చెప్పారు. తాము ఈ అంశంపై విశ్లేషణ చేయడానికి 89 అధ్యయనాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో దాదాపు 77 వేలమంది జీర్ణాశయ కేన్సర్ బారిన పడినట్లు కనుగొన్నామని వరల్డ్ కేన్సర్ రీసెర్చ్ ఫెడరేషన్ పరిశోధకులు పేర్కొన్నారు. మూడు పెగ్గుల మద్యం, నాన్వెజ్ను స్టోర్ చేసి తినే వారిలో అధికంగా వృద్ధులు కాన్సర్ బారిన పడినట్లు తెలిపారు. ఈ అలవాటు ఉన్న స్త్రీలకన్నా పురుషుల్లో ఈ ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటుందని వెల్లడించారు.