: రాణించిన సంజు శాంసన్, డుమిని...నిలదొక్కుకున్న రోహిత్, రాయుడు

ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సంజు శాంసన్, డుమిని రాణించడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ మంచి స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు ఆదిలోనే డికాక్ (1) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ (19) ఒకట్రెండు షాట్లతో మెరిసినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాడు. అనంతరం వచ్చిన సంజు శాంసన్ (60) దూకుడుగా ఆడాడు. అతనికి డుమిని (49) చక్కగా సహకారమందించాడు. కరణ్ నాయర్ (5) మాత్రం విఫలమయ్యాడు. పవన్ నేగి (10) డుమినితో కలిసి నాటౌట్ గా నిలవడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు 9 పరుగుల వద్ద పార్థివ్ పటేల్ (9) వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన అంబటి రాయుడు (21)తో కలసి ఓపెనర్ రోహిత్ శర్మ (32) నిలకడగా ఆడుతున్నాడు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేసి ఆకట్టుకుంటున్నారు.

More Telugu News