: యువరాజ్ కు, బ్రెట్ లీ కి నాలుగేసి రాఖీలు కడతాను: ప్రీతి జింటా

క్రికెటర్లు యువరాజ్ సింగ్, బ్రెట్ లీ లకు నాలుగేసి రాఖీల చొప్పున కడతానని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా చెప్పింది. యూఎస్ కు చెందిన వ్యాపారవేత్త జెన్ ను వివాహం చేసుకున్న తర్వాత ఒక ఆంగ్ల పత్రికకు తొలి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చింది. ఐపీఎల్ లో కింగ్స్XI పంజాబ్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా అయిన ప్రీతి జింటాకు యువరాజ్, బ్రెట్ లీలతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా... వాళ్లిద్దరూ తనకు సోదరులతో సమానమని చెప్పింది. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పానని పేర్కొంది. లేనిపోని సంబంధాలు అంటగడుతూ వచ్చే వదంతులు తనను చాలా బాధపెట్టాయని చెప్పింది. ‘ఈ విషయమై నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రాఖీ పండగనాడు యువరాజ్, బ్రెట్ లీ లను కలిసి వారికి రాఖీలు కడతాను. ఒకటో, రెండో కాదు ఏకంగా నాలుగు రాఖీల చొప్పున ఒక్కొక్కరికీ కడతాను. ఇప్పుడు తృప్తిగా ఉందా? అంటూ లేనిపోని సంబంధాలు అంటగడుతున్నవారిని అప్పుడు ప్రశ్నిస్తాను’ అని సొట్ట బుగ్గల సుందరి చెప్పింది.

More Telugu News