: వెంకన్న సేవలో అనిల్ అంబానీ... తల్లితో కలిసి వచ్చిన అడాగ్ చైర్మన్

అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీ నేటి ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తల్లి కోకిలా బెన్ తో కలిసి నిన్న రాత్రికే తిరుమల చేరుకున్న అనిల్ అంబానీ నేటి ఉదయం ప్రారంభ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ అంబానీకి టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

More Telugu News