: 21న కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, గాయని ప్రణవిల వివాహం

ఈ నెల 21న కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, గాయని ప్రణవిల వివాహం జరగనుంది. ఈ విషయాన్ని రఘు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. కాగా, వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత డిసెంబర్ 26న వీరి నిశ్చితార్థం జరిగింది. తమ పెళ్లి జరగనున్న వార్తతో పాటు నిశ్చితార్థం నాటి ఫొటోను కూడా రఘు పోస్ట్ చేశారు.

More Telugu News