: తిరుమలలో మెగాస్టార్ దంపతులు

తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి దంపతులు స్వామి వారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. అంతకుముందు ఆలయ పూజారులు చిరంజీవి దంపతులకు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తన రెండో కూతురు శ్రీజ వివాహమైతే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటామని, మొక్కులు చెల్లించుకుంటామని మొక్కుకున్నామన్నారు. అందుకే, శ్రీవారి దర్శనార్థం ఇక్కడికి వచ్చామని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, చిరంజీవి దంపతులతో పాటు శ్రీజ దంపతులు కూడా ఉన్నారు.

More Telugu News